ఐపీఎల్ ఫ్యాన్స్కు బీసీసీఐ ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. 2026 ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ మెగా టోర్నీ వివరాలను టీ20 వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా వెల్లడించింది.
IPL 2026 Start Date: ఐపీఎల్ ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్! క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ ఐపీఎల్ 2026.. మార్చి 28 నుంచి షురూ కానుంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మెగా టోర్నీ ప్రారంభ తేదీని బీసీసీఐ అధికారికంగా ప్రకటించగా.. స్టార్ స్పోర్ట్స్ తమ సోషల్ మీడియా ద్వారా ఈ గుడ్ న్యూస్ను పంచుకుంది.
పూర్తి షెడ్యూల్ ఇంకా రాకపోయినా.. ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడనే దానిపై మాత్రం క్లారిటీ వచ్చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు కాస్త ముందు ఈ అనౌన్స్మెంట్ రావడం విశేషం.
ఫస్ట్ మ్యాచ్ బెంగళూరులోనేనా?
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదిక కానున్నట్లు తెలుస్తోంది. గత సీజన్ ఛాంపియన్ ఆర్సీబీ (RCB), రన్నరప్ పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య ఈ ఓపెనింగ్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉందని గట్టిగా టాక్ వినిపిస్తోంది.
ఇక ఐపీఎల్ 2026 ఫైనల్కు కూడా చిన్నస్వామి స్టేడియమే వేదికయ్యే ఛాన్స్ ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ తమ సొంతగడ్డపై ఐదు మ్యాచ్లు ఆడే అవకాశం ఉండగా.. అదనంగా ఒక ప్లేఆఫ్ మ్యాచ్ కూడా అక్కడే జరగొచ్చని టాక్. కాగా, బీసీసీఐ త్వరలోనే పూర్తి షెడ్యూల్ను రిలీజ్ చేయనుంది.
రెండు దశల్లో ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..?
ఈసారి ఐపీఎల్ 2026 షెడ్యూల్ను రెండు దశల్లో ప్రకటించే అవకాశముందని ఇప్పటికే సమాచారం వచ్చింది. మొదటి దశ షెడ్యూల్ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించింది.
పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వల్లే.. పూర్తి షెడ్యూల్ రావడం కాస్త లేట్ అవుతోంది. అయితే, ఫ్యాన్స్ దీనికోసం మరీ ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన పనిలేదని తెలుస్తోంది.
ఇంతకీ ఐపీఎల్ 2025లో ఏం జరిగింది?
గత సీజన్ ఐపీఎల్ 2025 కూడా ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇండియా-పాక్ మధ్య టెన్షన్ల కారణంగా టోర్నీకి ఓ వారం రోజుల పాటు బ్రేక్ పడింది. ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో అదరగొట్టిన ఆర్సీబీ (RCB).. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఐపీఎల్ కప్ను ముద్దాడింది.
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ రన్నరప్తో సరిపెట్టుకుంది. ఫైనల్లో అదరగొట్టిన క్రునాల్ పాండ్యా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకొని.. ఆర్సీబీకి 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు.
ఇక లీగ్ స్టేజ్లో చూసుకుంటే.. పంజాబ్ కింగ్స్ ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్లో నిలిచింది. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ కూడా తలో 9 విజయాలతో రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. 8 విజయాలతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది.
ఇక ఐపీఎల్ 2024 ఛాంపియన్గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్.. గత సీజన్లో మాత్రం ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం ఐదే గెలిచి ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. ఇక రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లైతే ఏకంగా తొమ్మిది, పది స్థానాలతో టోర్నీని ముగించాయి.











Leave a Reply