ఏపీలోని మందుబాబులకు ఇదొక గుడ్ న్యూస్! రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు, బార్లలో ఇకపై డిజిటల్ పేమెంట్స్ తప్పనిసరి కానున్నాయి. ఏ షాపులోనూ యూపీఐ (ఆన్లైన్) పేమెంట్లను కాదనడానికి వీల్లేకుండా ప్రభుత్వం త్వరలో కొత్త పాలసీని తీసుకురాబోతోంది.
ఏపీలోని మందుబాబులకు కూటమి ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతోంది. రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు, బార్లలో డిజిటల్ పేమెంట్స్ను తప్పనిసరి చేస్తూ ఎక్సైజ్ శాఖ ‘లిక్కర్ డిజిటల్ చెల్లింపులు’ అనే కొత్త పాలసీని తీసుకురానుంది. ఈ విధానం అమల్లోకి వస్తే, ఏ షాపు యజమాని కూడా ఆన్లైన్ పేమెంట్లను తిరస్కరించడానికి కుదరదు. దీనివల్ల కస్టమర్లకు పేమెంట్ సులువు కావడంతో పాటు, మద్యం విక్రయాల్లో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

నెల రోజుల్లో అమలు
ఈ కొత్త డిజిటల్ పాలసీకి సంబంధించి ఎక్సైజ్ శాఖ ఫైల్ రెడీ చేసింది. వచ్చే కేబినెట్ మీటింగ్లో ఆమోదముద్ర పడగానే ఇది అమల్లోకి వస్తుంది. నిజానికి ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఆన్లైన్ పేమెంట్స్ తీసుకుంటున్నారు. కానీ దాన్ని అధికారికంగా, కచ్చితంగా అమలు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. పేమెంట్ల కోసం షాపులకు కావాల్సిన పరికరాలను కూడా ఎక్సైజ్ శాఖే ఇవ్వనుంది. ప్రస్తుతం 30 శాతంగా ఉన్న డిజిటల్ పేమెంట్లను 60 శాతానికి పెంచాలన్నది ఎక్సైజ్ శాఖ ప్లాన్.
యజమానుల నిర్లక్ష్యానికి చెక్:
షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ తీసుకోవాలని ఇప్పటికే రూల్ ఉన్నా, యజమానులు దాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ప్రభుత్వం ఈసారి సీరియస్గా అడుగులు వేస్తోంది. ఇకపై ప్రతి లావాదేవీ ఎప్పటికప్పుడు ఎక్సైజ్ శాఖకు తెలిసిపోతుంది. మందు ఎక్కడ తయారైంది, ఎక్కడ అమ్ముడవుతోంది అనేది పసిగట్టేందుకు ‘ట్రాక్ అండ్ ట్రేస్’ విధానాన్ని తీసుకొస్తున్నారు. ప్రభుత్వమే స్వయంగా స్కానర్లు ఇస్తుంది కాబట్టి, ప్రతి బాటిల్ను తప్పనిసరిగా స్కాన్ చేశాకే కస్టమర్కు ఇవ్వాలి. కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ చేయగానే ఆ వివరాలు ఎక్సైజ్ శాఖ డేటాబేస్లోకి వెళ్లిపోతాయి. దీనివల్ల లెక్కల్లో ఎలాంటి గోల్ మాల్కూ ఆస్కారం ఉండదు.











Leave a Reply